మన్యం మనుగడ,గుండాల:
గుండాల నుండి జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం కు ప్రయాణం చేయాలంటే ఇల్లందు టేకులపల్లి మీదుగా 110 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది కలెక్టరేట్ కు ఆర్ టి ఓ ఆఫీసులకు , ఐ టీ డీ ఏ భద్రాచలం వేళ్ళాలన్నా ప్రజలు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,గుండాల నుండి వయా అనంతోగు,సంపత్ నగర్ అన్శేట్టిపల్లి మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినతిపత్రం అందజేశారు.మంత్రి వేంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి వినతిపత్రం పై ఆమోద సంతకం పేట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆజాద్ ,సంతోష్, వినయ్ ,వంశీ ప్రణయ్, శ్యామ్ , అనీల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: