CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Share it:

 


 ఆళ్ల పల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి

 గుండాల /ఆళ్ల పల్లి జూలై 1  (మన్యం టీవీ) పల్లె ప్రగతి  ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి కోరారు. గురువారం పల్లె ప్రగతి ప్రారంభోత్సవ ఈ కార్యక్రమానికి ఆమె రామంజి గూడెం గ్రామ పంచాయతీకి హాజరై ఆమె మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తుందన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. హరితహారం కార్యక్రమం నిర్వహించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును  స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించిన వారం అవుతా మన్నారు. గొప్ప  సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాలను రూపొందిస్తుంటారు ఎమ్మెల్యే రేగా కాంతారావు రేగా కాంతారావు ఆదేశానుసారం ముందుకు  సాగుతున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  పూనెం నిర్మల , ఉప సర్పంచ్ రామకృష్ణ , కార్యదర్శి ప్రవీణ్ , ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: