*వరుస దొంగతనాలతో హాడలెత్తుతున్న మణుగూరు ఏజెన్సీ ప్రజలు
*ఇటీవలే కరకగూడెం, అశ్వాపురం లో
*నేడు పినపాక పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ దొంగలింపు
మన్యం మనుగడ:మణుగూరు సబ్ డివిజన్ లో దొంగలు హల్చల్ చేస్తున్నారు.ఇటీవలే కరకగూడెం మండల కేంద్రం లో ఓ బ్యాంక్ మేనేజర్ ద్విచక్ర వాహనం,బట్టుపల్లి లో ఓ ఆటోకి చోరీకి గురైనది.అశ్వాపురం మండలం లో ఓ ఆటో డ్రైవర్ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.80వేల విలువైన సొమ్ము, నగదును తస్కరించారు.సోమవారం అర్ధరాత్రి పినపాక పంచాయతీ కార్యాలయానికి చెందిన ట్రాక్టర్ బ్యాటరీ చోరీకి గురైనది.ఇలా వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.దొంగతనాలపై పోలీసులు నిఘా పెంచాలని మణుగూరు సబ్ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: