CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వికలాంగునికి ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుని చేయూత

Share it:

 



స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృత్రిమ కాలు అమరిక


జన్మజన్మలకు ఋణపడి ఉంటాను: సప్క విష్ణు


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీకి  దేవ నగరం కు చెందిన పినపాక మండల ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన 

సప్క విష్ణు షుగర్ వ్యాధి కారణంగా కుడి కాలికి గాయమై, కాలు మొత్తం పాడైన కారణంగా, వేరే దారి లేక వైద్యులు కుడికాలును తొలగించారు. కోలుకొని ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన తర్వాత, సామాజిక సేవకుడైన తోలెం శ్రీనివాస్ ను కలిసి తన బాధను తెలియజేయగా, వెంటనే స్పందించిన శ్రీనివాస్ విజయవాడలోని రోబోటిక్ రిహాబిలిటేషన్ సెంటర్ కు ఫోన్ చేసి, సప్క విష్ణు కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. విష్ణు కు సంబంధించిన వివరాలు తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ వారు విష్ణుకు రోబోటిక్ కాలు అమర్చడానికి పూనుకున్నారు. కొద్ది రోజుల క్రితం  శ్రీనివాస్ సప్క విష్ణును  రోబోటిక్ రిహాబిలిటేషన్ సెంటర్ కు తీసుకెళ్లగా, కొలతలు తీసుకుని పంపించారు. వారం రోజుల తర్వాత పిలిపించి,

సుదిక్షన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు   విమల ద్వారా, విష్ణుకు కృత్రిమ కాలును అమర్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకురాలు విమల మాట్లాడుతూ, కాలు అమర్చిన విష్ణుకు భవిష్యత్తులో ఆర్థికపరంగా సహాయ సహకారాలు అందించి, చిన్న వ్యాపారం ప్రారంభించేలా సహకరిస్తామని తెలియజేశారు. తొలి శ్రీనివాస్ చేసిన ఈ కార్యక్రమం కారణంగా మండలంలోని పలువురు అభినందిస్తున్నారు.

Share it:

Post A Comment: