ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, షాపల్లి గ్రామాల మధ్య వట్టి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు బుధవారం, గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిపోయింది. దీంతో షాపల్లి, దొడ్ల, కొండాయి, మల్యాల గోవింద రాజుల కాలనీ,కొత్తూరు గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ వాగుపై గతంలో హైలెవెల్ కాజ్ వే ఉండగా గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో తాత్కాలికంగా ప్రజల అవసరాల నిమిత్తం డైవర్షన్ రోడ్డును పోసి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా లేక వాహనాల రవాణాకు అంతరాయం ఏర్పడింది.
Post A Comment: