మన్యం టీవీ కరకగూడెం:మండలరిదిలోని తాటిగూడెం గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి లో భాగంగా ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని డియంమెడ్ హెచ్ఓ డా,,శిరీష పరిచిలించారు.అనంతరం దోమల మందు పిచికారి దగ్గర సందర్శించి దోమ తెరల వాడకం మరియు ఫ్రైడే-డ్రైడే ఆక్టివిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు.తరువాత కరకగూడెం ప్రభుత్వ వైద్య శాలను సందర్శించి డ్రగ్ స్టోర్, ల్యాబ్ ,ఇంపేషెంట్ వార్డ్ డెలివరి రూమ్ మరియు రికార్డులను పరిచిలించారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ వర్షాకాలం వచ్చే వ్యాదుల పట్లా ప్రజలకు అవగాహన కల్పించి పల్లెల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని డా,,పర్షియా నాయక్ కి వివరించారు.కరోనా సెకండ్ వెవ్ ఇంకా పూర్తిగా తగ్గలెదని ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి సామజిక దూరం పాటిస్తూ మాస్క్, శానిటైజర్ వాడుతు ప్రజలు కరోనా భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అమె అన్నారు.అలాగే అన్ని గ్రామాలలోని ఏ ఏన్ ఏమ్ లు,ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటు సీజనల్ వ్యాదులు,కరోనా భాదితులకు సూచనలు సలహాలు తప్పనిసరిగా ఇవ్వలన్నారు.ఈ కార్యక్రమంలో డా,,పర్షియా నాయక్ సబ్ యూనిట్ ఆఫీసర్ లింగ్యానాయక్ హెచ్ఏ కృష్ణ నర్సిహరావు ఏ ఏన్ ఏమ్ విజయలక్ష్మీ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: