గ్రామ సభలో తీర్మానించిన గ్రామస్తులు
గుండాల జూలై 19 (మన్యం మనుగడ) గుండాల స్మశాన వాటికలో మెగా పార్క్ ఏర్పాటు చేయవద్దని గుండాల గ్రామ సభలో తీర్మానించారు. ఆదివారం దీనిపై గ్రామ సభ నిర్వహించగా ముక్తకంఠంతో గ్రామ సభలో మెగా పార్కు వ్యతిరేకంగా గ్రామస్తులు తీర్మానించారు. కష్టం మీద మశానం వాటికకు భూమిని సేకరించామని అది కూడా అన్ని కులాలకు కలిపి వినియోగించడం వలన భవిష్యత్తులో స్థలం సరిపోక ఇబ్బందులు గురవుతాయని అందుచేత మరి ఏ ప్రదేశం లో నైనా మెగా పార్కును ఏర్పాటు చేయాలని తీర్మానించారు. దానితోపాటు గుండాల గ్రామపంచాయతీ కొన్ని ఖాళీ ప్రదేశాలను గుర్తించడం జరిగిందని అందులో పెద్ద మొత్తంలో పిచ్చి మొక్కలు పెరిగి సీజనల్ వ్యాధులకు వ్యాప్తి చెందే విధంగా ప్రదేశాలు ఉన్నాయి కనుక వాటికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు స్థల యజమానులు వాటిని శుభ్ర పరచకపోతే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాటిని శుభ్రం చేసి గ్రామపంచాయతీ స్వాధీనపరచు ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీతారాములు, సెక్రెటరీ సురేష్, గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: