మన్యం టీవీ బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని ఇరవెండి పంచాయితీలో జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో వ్యవహరించి పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచి కొర్సా లక్ష్మీ,ఇరవెండి మాజీ ఎంపీటిసీ సభ్యులు వల్లూరి పల్లి వంశీకృష్ణ,ఐటీసీ అధికారి చెంగల్ రావు,ప్రత్యేక అధికారి సలోమి,తాళ్ళూరి రాధాకృష్ణ, ఇరవెండి ఉప సర్పంచి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: