CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ మండలం లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :                చండ్రుగొండ మండలంలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం మండలం లో విస్తృతంగా పర్యటించారు.  హరితహారం లో భాగంగా పోకలగూడెం లో మొక్కలు నాటి ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పోకలగూడెంలో విద్యుత్ ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కర్లపాటి గంగరాజు కుటుంబానికి పరామర్శించి ఆర్ధిక సహాయం అందించారు. అనంతరం మండలం లో పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. టేకుల బంజరలో కరోనాతో మృతి చెందిన మాజీ ఎంపీపీ గుగులోతు బాలు కుటుంబాన్నీ పరామర్శించారు.సుంకర బంజరలో ఎంపీపీ బానోతు పార్వతి భర్త బానోతు రాముడు అనారోగ్యంతో బాధ పడుతుండగా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమాల్లో డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, టీఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భోజ్య నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి,జెడ్పిటిసి వెంకట రెడ్డి, సారేపల్లి శేఖర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గాదె లింగయ్య, లేళ్ల వెంకట్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు జారే ఆది నారాయణ, మేడ మోహనరావు, జిల్లా బీసీ సంఘం నాయకులు భూపతి శ్రీనివాసరావు, దారా బాబు, సత్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: