మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లోని రాజీవ్ నగర్ గ్రామంలో సిపిఎం ఏడవ శాఖ మహాసభను ఉద్దేశించి జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ అబ్దుల్ నబీ మాట్లాడుతూ.. పోడు భూముల రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలని మరియు ఫారెస్ట్ అధికారుల నిర్బంధం ఆపాలని, పోడు భూముల రైతులు వేసిన పంటను నాశనం చేయరాదని, ఆయన మాట్లాడారు. నూతన శాఖ కార్యదర్శిగా కామ్రేడ్ ధారావత్ రాందాస్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: