CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ మంగపేట ముంపు ప్రాంతాల సందర్శన

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 గిరిజన  సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్  భారీ వర్షాల వల్ల ముంపు ప్రాంతాలను  దర్శించుటకు మంగపేట విచ్చేసినారు.అందులో భాగంగా ములుగు జిల్లా మంగపేట  మండలం మంగపేట లోని గోదావరి పుష్కర ఘాట్ వద్దకు విచ్చేసి గోదావరికి కోతకు గురైన భూములను పరిశీలించారు.విలువైన భూములు కోతకు గురవుతున్ననందున ప్రభుత్వము నుండి 137 కోట్లు కరకట్ట కోసం నిధులు మంజూరయ్యాయి టెండర్లు పిలువలే నందున పనులు ఆగిపోయినవి. కరకట్ట నిర్మాణము గూర్చి మన ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  దృష్టికి తీసుకు వెళ్లడం జరిగినది.వారు కూడా స్పందించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపినారు. ఇట్టి కరకట్ట నిర్మాణము అతి త్వరలో పూర్తి చేయుటకు మంగపేట ఎక్స్ జడ్పీటీసీ సిద్ధం శెట్టి వైకుంఠము టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ మరియు గ్రామ శాఖ తరపున మెమోరాండం ఇవ్వడం జరిగినది  ములుగు జిల్లా పరిషత్తు కుసుమ జగదీష్ కు జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించడం జరిగింది.మంగపేట టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మండల శాఖ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మంత్రివర్యుల కు తెలిపినారు.

Share it:

Post A Comment: