CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అబ్బుగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సంబరాలు

Share it:

 


( సంబరాల్లో పాల్గొన్న టిపిసిసి మహిళా ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి)

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అనుమల రేవంత్ రెడ్డి. బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చెరుకూరి ప్రసాద్ ఆధ్వర్యంలో టి పి సి సి మహిళా ప్రధాన కార్యదర్శి ములకలపల్లి జెడ్పిటిసి-సున్నం నాగమణి పాల్గొని కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సున్నం నాగమణి మాట్లాడుతూ శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నాయకులు,కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని, 2023 సంవత్సరంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సంబరాల కార్యక్రమాల్లో మిద్దె సీతారాములు, కర్రీ వెంకన్న, నీలపాటి వెంకట్ రెడ్డి, ఆకుల శివ నాగు, మిద్దె నరసింహారావు, లంక కృష్ణ అర్జున రావు, గడ్డిపాటి వెంకటేశ్వరరావు, లంక నాగు, కృష్ణ, తుమ్మూరి రామిరెడ్డి, మిద్దె శ్రీను, కొత్తూరు రామారావు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: