మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి హనుమంతు కే జెండా గే ఆదేశాల మేరకు గిరిజన రైతులకు చిరుధాన్యాల విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఐటిడిఎ పిఏఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ములుగు జిల్లా లో ఏటూరు నాగారం కన్నాయిగూడెం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మండలాలలో నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు 1359 మంది గిరిజన రైతులను ఎంపిక చేసి చిరుధాన్యాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
Post A Comment: