కోవిడ్ మహమ్మారిని పారద్రోలాలనే సంకల్పంతో భారత ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో "బీట్ కోవిడ్ క్యాంపెయిన్" నిర్వహించగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మణుగూరు నుండి ఐదుగురు విద్యార్థులు వాలంటీర్లు గా ఎన్నిక అవటం జరిగింది. వారి ద్వారా హాస్పటల్లో కోవిడ్ నిర్వహణ, హాస్పటల్ ఏతర మేనేజ్మెంట్, కోవిడ్ గురి అయిన కుటుంబాలకు మద్దతు, మెడికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ వంటి అనేక అంశాలలో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారి ద్వారా కోవిడ్ బారినపడిన విద్యార్థుల, వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులను మానసికంగా శారీరకంగా దృఢ పరిచే సంకల్పంతో జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) విద్యార్థులను వాలంటీర్లుగా తయారు చేయడం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నిర్వహించిన ఈ బీట్ కోవిడ్ క్యాంపెయిన్ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ కు అందించడం జరిగింది.
Post A Comment: