కిరాణా కొట్టుతో పాటు..ద్విచక్రవాహనం ధ్వంసం..
మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలోని వికలాంగుల కాలనీ వద్ద ఆదివారం కార్క్ ఆయిల్ ట్యాంకర్ పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుండి విజయనగరం వైపునకు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును గుద్దడంతో, కిరాణా కొట్టుతో పాటు, ద్విచక్రవాహనం ధ్వంసం ఐనది. చెట్టును ఢీ కొట్టి ఉండకపోతే పక్కనే ఉన్న కిరాణా షాప్ లోకి దూసుకు పోయి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది చెట్టును ఢీకొట్టి తిరగబడతంతో ట్యాంకర్ లో ఉన్న కార్క్ ఆయిల్ నేల పాలయింది.ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ కు స్వల్ప గాయాలతో బయటబడ్డాడు.
Post A Comment: