మాస్కులు శానిటైజర్ తో పాటు సామాజిక దూరం తప్పనిసరి పాటించాలి
ఆళ్ల పల్లి వైద్యాధికారి సంధ్యారాణి
గుండాల /ఆళ్ల పల్లి జూన్ 30 (మన్యం టీవీ) ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని ఆళ్ల పల్లి ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారిణి సంధ్యారాణి సూచించారు. దానితోపాటు తప్పనిసరిగా మాస్కులు శానిటైజర్ వాడాలని ఆమె అన్నారు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మార్కు ధరించాలని ఆమె సూచించారు. ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని ఆమె అన్నారు. ప్రజలు కరోనా తగ్గిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు ఆళ్ల పల్లి మండలం లో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రజలు దానిని గమనించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఆమె కోరారు
Post A Comment: