మన్యం టీవీ, టేకులపల్లి:
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యాక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి జిల్లా నలుమూలలా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటిన అనంతరం ఇటీవలే కరోనా బారినపడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ .కోరం కనకయ్య త్వరలోనే కరోనా మహమ్మారిని జయించి తిరిగి మనముందుకు ఆయురారోగ్యాలతో రావాలని కోరుతూ నేడు టేకులపల్లి మండల పరిధిలోని కొండంగుల బోడు కొండపై గల వీరభద్రుడికి పూజాకార్యాక్రమాలు నిర్వహించిన అనంతరం శివలింగాభిషేకం వంటి పూజాకార్యాక్రమాలు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో కుంటల్ల,రామ చంద్రునిపేట,మేళ్ళమడుగు సర్పంచులు మోకాళ్ళ రమాదేవి, వీసాల ఉపేందర్,మాడే మధు, కుంటల్ల ఉప-సర్పంచ్ సురేష్,వార్డ్ మెంబర్ వెంకట నర్సమ్మ, సులానగర్ 10 వార్డు మెంబర్ వీరస్వామి,తెరాసా నేతలు మోకాళ్ళ పోశం, ధర్మయ్య గౌడ్,రావూరి సతీష్,బొడ్డు అశోక్,ఉండేటి చెన్నయ్య,బొమ్మెర్ల శ్రీనివాస్, మొగలగంటి శ్రీనివాస్, నరందాస్ కోటయ్య, పాలొగొన్నారు.
Post A Comment: