మన్యం టీవి ;ములకలపల్లి మండలం ; మండల అద్యక్షురాలు ఎంపిపి మట్ల నాగమణి ఆద్వర్యం లో భద్రాచలం ప్రాజెక్టు అదికారికి పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. మండలం లోని పోడు వ్యవసాయ భూములకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భంధు డబ్బులు వస్తున్నాయి కానీ ,వాటికి ఆర్ వో ఎఫ్ ఆర్ పట్టాలు లేవని,కావున వెంటనే ప్రభుతమే సర్వే చేయించి పట్టాలు ఇప్పించాలని, మరియు గిరిజన సహకార సంస్థ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తున్న గిరిజన నిరుద్యోగ యువకులు 24 గంటలు పనిచేస్తున్నారని , వారికి వేతనంగా 7000రుపాయలే ఇస్తున్నారని, పీనల్ కోర్ట్ యాక్టు ప్రాకారం గా ఏజెన్సీ ప్రాంతం లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న యువకులకు 8గంటల పని,మరియు 12000రూపాయల వేతనం,టి ఏ , డి ఏ లు , ఇన్సూరెన్సులు,గుర్తింపు కార్డులు, ఇవ్వాలని,సంబంధిత అధికారుకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైటి రాజేష్ తాళ్లపాయ సర్పంచ్ , వాడే నాగరాజు మాధారం సర్పంచ్ ,రాజులు పాల్గొన్నారు .
Post A Comment: