మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని తారకరామా కాలనీలో నిరు నీరుపేద కుటుంబానికి చెందిన బొజ్జ పోశాలు ఇటీవలఅనారోగ్యంతో మృతి చెందగా మండలంలోని అంబేద్కర్ విగ్రహ,భవన్ నిర్మాణ కమిటీ వారు
దశ దిన ఖర్మ రోజున 2000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నెమలి నర్సయ్య
మాట్లాడుతూ.కమిటీ సభ్యులు అంత అందరూ కూడా రెక్కాడితే డొక్కాడని పేద కూలీలుపేద కుటుంబాలలో ఆపద వస్తే డబ్బులు లేక పడే ఇబ్బందులుఅనుభావించినవాళ్ళం కనుక మాకు మేము మృతి చెందిన పేద కుటుంబాలకు మాకు తోచిన విధంగా కొంత డబ్బును వారి కుటుంబానికి ఆసరాగా ఇస్తున్నాం అని అన్నారు.
మాలాగే ఇతరులు కూడా స్పందించి పేద కుటుంబాలను ఆదుకోవాలి కోరారు.
కమిటీ సభ్యులు అందరూ సహాయసహకారాలతో పేద వారికి సహాయం చేస్తున్నాం అని అన్నారు.
కమిటీ లో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి వారి కష్టార్జితం అందజేస్తేనే ఈకార్యక్రమం ముందుకు సాగుతోంది అని అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ కమిటీ చైర్మన్ నెమలి నర్సయ్య మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పడిదల సాంబయ్య,సెక్రటరీ జనరల్ నక్క రాజు,అధికార ప్రతినిధి దూడపాక రాజేందర్,నెమలి బాలకృష్ణ,జన్ను కర్నాకర్,సింగపురం కృష్ణ,
ఉట్ల మోహన్,ఘణపక సుధాకర్,మాల్యాల ప్రకాశ్, పోలేపాక శ్రీను,బొజ్జ పోశాలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: