CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీజనల్ వ్యాధుల ప్రబలకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి

Share it:

 


 గుండాల జూలై 16 (మన్యం మనుగడ) సీజనల్ వ్యాధుల ప్రబలకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని పీ వై ఎల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఈ సం కృష్ణ , ఎనుగంటి గణేష్ డిమాండ్ చేశారు. మండలంలో మలేరియా, డెంగ్యూ, మరియు కరోనా విజృంభించడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామ పంచాయతీల వారిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. మండలం మొత్తానికి ఓకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నందున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అందుచేత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తే ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు. కరోనా టిక కార్యక్రమం మందకొడిగా సాగుతుందని రోజుకు పదిమందికి టీకాలు వేస్తున్నారని వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల మాజీ సర్పంచ్ కోరం శాంతయ్య , కోడూరు జగన్, సనప కుమార్, ముక్తి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: