మన్యం మనుగడ, అశ్వాపురం:
మల్లెలమడుగు గ్రామ పంచాయితీలో సర్పంచ్ కోడి కృష్ణవేణి అధ్యక్షతన ఏర్పాటుచేసిన 7వ విడత హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ సందర్భంగా రామచంద్రపురం,నెల్లిపాక పంచాయితీలో ప్రకృతివనం,డంపింగ్ యార్డ్,స్మశానవాటిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకం తోనే మానవ మనుగడ ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ తరాల కోసం కోట్ల మొక్కలు పెంచడం హర్షణీయమన్నారు .ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచులు కోడి కృష్ణవేణి,కాకా అశోక్, గొర్రెముచ్చు వెంకటరమణ,మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్,ఎంపీటీసీ గాదె జయ,ఉపసర్పంచ్ రాఘవులు,సురేష్ రెడ్డి,మండల తెరాస నాయకులు మొగిల్ల వీరారెడ్డి,సత్యనారాయణ,శ్రీనివాసరావు,వలబోజు మురళీకృష్ణ,అన్గన్వాడీ టీచర్స్,పంచాయితీ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: