CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత సాధికారత పథకం పై అవగాహన కార్యక్రమం.

Share it:

 




మన్యం మనుగడ, పినపాక: 


తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల దళితులు అణచివేతకు గురవుతున్న నేపథ్యంలో దళితుల సాధికారత కోసం "దళిత సాధికారత పథకం"ప్రవేశ పెట్టిన నేపథ్యంలో పినపాక మండలం లోని భూపాలపట్నం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ కొర్సా కృష్ణంరాజు అధ్యక్షునిగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుమ్మడి గాంధీ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సాధికారత కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకము దళిత జాతి కి ఒక వరం లాంటిదని, కొనియాడారు. ప్రతి ఒక దళిత కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తెలియజేశారు.ఈ పధకం పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఖచ్చితంగా ప్రతి దళిత కుటుంబాన్ని ఈ పథకంలో భాగస్వామిని చేస్తారని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలియజేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, దళిత సాధికారత పధకము ద్వారా మండల వ్యాప్తంగా మొదటి ప్రయోగాత్మక కార్యక్రమంగా యూనిట్లను మంజూరు చేసి, గ్రామసభల ద్వారా తీర్మానం చేసి లబ్ధిదారులను గుర్తిస్తారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భూపాలపట్నం ఎంపీటీసీ సోలం కుమారి, ఉప సర్పంచ్ నిట్టా వెంకటేశ్వర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: