👉హుషారుగా మొక్కలు నాటిన కాపు సీతాలక్ష్మి
మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 9:- శుక్రవారం నాడు
కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి 6,15,17,19,21వ వార్డులలో పట్టణ ప్రగతి లో 7వ విడత హరితహారం లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
ఇందులో భాగంగా 17వ వార్డులో నూతన డ్రైన్లు నిర్మించాలని అని వార్డు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఎమ్మెల్యే వనమా కి వార్డు ప్రజలు తెలపడంతో తక్షణమే వార్డులో నూతన డ్రైన్స్ ని నిర్మించాలని మున్సిపల్ చైర్పర్సన్ సీతా లక్ష్మి కి మరియు కమిషనర్ సంపత్ కుమార్ కి చెప్పి,ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి 11 కిలో వాట్స్ హై టెన్షన్ లైన్లను మార్చడానికి తగిన వంటి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించడం జరిగినది.
దీని అనంతరం మునిసిపల్ చైర్పర్సన్ కాపుసీతాలక్ష్మి 21వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ మాధ సత్యవతి, 19వ వార్డ్ కౌన్సిలర్ బండి నరసింహ తో కలిసి వర్షం సైతం లెక్కచేయకుండా వార్డులో మొక్కను నాటడం జరిగింది.
వార్డు కౌన్సిలర్స్ గుమ్మడాల కళ్యాణి,బండి నరసింహ మాదా సత్యవతి, కో -ఆప్షన్ మెంబెర్స్ దూడల బుచ్చయ్య,ఎండి యాకుబ్ పాషా, మున్సిపల్ కమిషనర్ సంపత్ సంపత్ కుమార్,డి ఈ నవీన్,ఏ ఈ రాము, మున్సిపల్ జవాన్లు, వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్, వార్డ్ ఆఫీసర్స్, ఆర్ పి ఎస్, అంగన్వాడీ వర్కర్స్, ప్రజా ప్రతినిధులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: