CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

Share it:

 


*పల్లె ప్రకృతి వనంను పరిశీలించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య


*గోదావరి వరదల పై అప్రమత్తంగా ఉండాలి* : *జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య


*వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


మన్యం టీవీ మంగపేట.


 గోదావరి వరదలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మండల అధికారులకు సూచించారు. మండలంలోని వరద ముంపు ప్రాంతం అయిన అకినేపల్లి  మల్లారంను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ఆదర్శ్ సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంతు కే జెండేగె లు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి వరద నివారణ, రక్షణ చర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానిక అధికారులకు సూచించారు. గోదావరి వరదలు వస్తే గ్రామంలో ముంపు ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో అకినేపల్లి మల్లారం గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ అధికారులకు తెలిపారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనంను, వైకుంఠధామంను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ఆదర్శ్ సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంతు కే జెండేగె లు స్థానిక అధికారులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంగపేట తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీడీవో ఎండీ. ఇక్బాల్ హుస్సేన్, ఎంపీఓ బీ. శ్రీకాంత్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో భవాని, అకినేపల్లి మల్లారం వీఆర్ వో పత్రి బాణయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: