👉టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు పిలుపు
మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 30):: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కుమార్. ఆదివారం నాడు అన్నపురెడ్డిపల్లి మండలం, అన్నపురెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని రైతు వేదిక, వైకుంఠం ధామం.పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలోని రైతు వేదికలను ప్రారంభించి, గుంపెన గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనంలను సందర్శించనున్నారు.మండలంలో వారి పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు అధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి,మంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు-సున్నం లలిత, బోడ పద్మ, పర్సా వెంకటేశ్వరరావు. నాయకులు-కొత్తూరు వెంకటేశ్వరరావు,వేముల హరీష్, భారత రాంబాబు, కాళ్ళూరి పవన్ బాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు,చాల్లా రాంబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: