-ఐటీడీఏ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ.
మన్యం టీవీ ఏటూరునాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలో ములుగు జిల్లా స్వేరో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు వెంపల్లి వీరస్వామీ ఆధ్వర్యంలో ప్రజాబందు ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కి స్వాగత ర్యాలీ నిర్వహించారు ఈసమావేశంలో గుండాల రఘు ,నరేష్,శ్యామ్, రాజబాబు, మాట్లాడుతూ ఏటూరునాగారం నుండి బస్టాండ్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు మన బహుజన నాయకుడు ప్రజాబందు ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ ప్రజల కోసం తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి పేద బడుగు బలహీన వర్గాల కోసం వస్తున్నందున ఈ రోజున ఏటూరునాగారం మండల కేంద్రం ఐటీడీఏ నుంచి బస్టాండ్ వరకు 100మంది స్వేరో, ప్రజాసంఘాలలో స్వాగత ర్యాలీ తీయడం మరియు బస్టాండ్ ఆవరణలోని భారతరాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు వేంపల్లి వీరస్వామీ స్వేరో,
ములుగు జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు సునార్కని రాజబాబు స్వేరో,కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సునార్కని శ్యామ్ స్వేరో,ములుగు జిల్లా స్వేరో ఇంటర్నేషనల్ అధ్యక్షుడు గుండాల రఘు స్వేరో, స్వేరో సర్కిల్ కాళేశ్వరం జోనల్ ఉపాధ్యక్షుడు నరేష్ స్వేరో,పడిదెల మహెందర్ స్వేరో దుర్గం సంతోష్ స్వేరో ,సునార్కని భైరేష్ స్వేరో సునార్కని రాజ్ కుమార్ స్వేరో,తదితర స్వేరో మరియు అనుభంద సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: