మన్యం టీవీ : జూలూరుపాడు,
జూలై 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల సంఘం అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక బుధవారం ఎల్లంకి గార్డెన్ లో ఆ సంఘం జిల్లా ఎన్నికల అధికారి బి అనిల్ మండల ఎన్నికల అధికారి గుండా సత్యనారాయణ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జూలూరుపాడు మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ ల సంగం అసోసియేషన్ అధ్యక్షులు గా పాపకొల్లు గ్రామానికి చెందిన ధారావత్ నర్సింహారావు, ను ఎన్నుకొన్నారు. ఉపాధ్యక్షులుగా చౌడం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా భోగ సతీష్, కోశాధికారి అనుముల భద్రయ్య, కుమార్, సహాయ కార్యదర్శి భూక్య రత్నకుమార్, ప్రచార కార్యదర్శి ఎస్.కె యాకూబ్ పాషా, తో పాటు మరికొంతమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు.
Post A Comment: