చికెన్ దుకాణాలకు ప్రత్యామ్నాయ స్థలం చూపించండి
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం కమలాపురం గ్రామంలో గత కొంతకాలంగా చికెన్ దుకాణాలు మరియు హెల్త్ సెంటర్ నిర్మాణం విషయంలో జరుగుతున్న సమస్యను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మరియు ఐ టి డి ఏ ప్రాజెక్టు ఆఫీసర్ హనుమంతు జిండగే శుక్రవారం సందర్శించి చికెన్ దుకాణ దారులతో మాట్లాడి వారికి ప్రత్యామ్నాయంగా వేరే స్థలంలో చికెన్ దుకాణాలు నిర్మించాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి కి,ఎంపిఓ కి ,ఎంపిడిఓ ను ఆదేశించారు.దానికి చికెన్ దుకాణదారులు కూడా అంగీకరించారు. కావున ఈ స్థలంలో వెంటనే హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా వారి దగ్గరి నుండి వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంపిఓను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి, ఎంపిడిఓ ఇక్బాల్ హుస్సన్, ఎంపిఓ శ్రీకాంత్ మరియు చికెన్ దుకాణాల యజమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: