మన్యంటీవీ, అశ్వారావుపేట: మండల పరిదిలోని సున్నం బట్టి గ్రామానికి చెందిన వి ముత్తమ్మ(85) కరోనాతో బాధపడుతూ హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతు, శనివారం ఉదయం మృతి చెందటంతో కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ సేవా సమితి కి దహనసంస్కారాలు చేయవలసిందిగా కోరగా, వెంటనే స్పందించిన సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావు టీం సభ్యులతో కలిసి గ్రామానికి చేరుకొని హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కురిశెట్టి నాగబాబు నాయుడు, మిండ హరిబాబు, నార్లపాటీ అశోక్, చిట్టితల్లి అంబులెన్స్ డ్రైవర్ బాజీ, సాయి పాల్గొన్నారు.
Post A Comment: