👉కర్రల వంతెన పై వచ్చిన కథనాన్ని స్పందించిన కలెక్టర్ అనుదీప్
👉 కిన్నెరసాని కర్రల వంతెన పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది
గుండాల జూలై 13 (మన్యం మనుగడ) కర్రల వంతెన పై వచ్చిన కథనానికి స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్. మంగళవారం కొన్ని పత్రికల్లో చానళ్లలో కిన్నెరసాని కర్రల వంతెన పై నుండి పెద్ద మొత్తంలో వాగు దాటుతున్న దృశ్యం ప్రచురణ కావడంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ అనుదీప్ గుండాల తాసిల్దార్ రంగు రమేష్ ,మరియు ఎంపీడీవో వలి కిన్నెరసాని వాగు వద్ద కు వెళ్లి కర్రల వంతెన ను పరిశీలించారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ పరిశీలించారు. వీరి వెంట టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, ఆర్ ఐ నాగేశ్వరరావు, మరియు ముక్తాపురం సర్పంచ్ పూనం సమ్మయ్య ,తదితరులు ఉన్నారు
Post A Comment: