CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో తడి-పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 4:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం పురపాలక పరిధిలోని  6,13,15,20,26 వ వార్డులనందు మున్సిపల్ చైర్ పర్సన్ 3వ పట్టణ ప్రగతి 4 వ రోజు లో భాగంగా వార్డులో పర్యటించడం జరిగింది.

రామవరం ఆరో వార్డు నందు చైర్ పర్సన్ సీతా లక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు తడి చెత్త - పొడి చెత్త పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి తడి-పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందజేయాలని, అలాగే ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని వావ్ మరియు మెప్మా సిబ్బంది తో వార్డ్ ప్రజలకు అవగాహన కలగడానికి రాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు, అదేవిధంగా వార్డ్ లో ఉన్నటువంటి పలు సమస్యలను డ్రైన్ క్లీనింగ్ శానిటేషన్ రోడ్స్ మరియు ఇతర సమస్యలపై వార్డు ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగినది. 

అదేవిధంగా వార్డ్ లో వార్డు కౌన్సిలర్స్ తో పర్యటించి వార్డ్ లలో కొత్తగా నిర్మించాల్సిన డ్రైనేజీ లో, రోడ్లో మరియు ఖాళీ స్థలం లను జెసిబి సహకారంతో శుభ్రం  చేపించి అక్కడ పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్స్ విమల,లక్ష్మణ్,వేణుగోపాల్, సుజాత మరియు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరభద్ర చారి, వెల్ బీయింగ్ ఆఫ్ వేస్ట్ ఆఫీసర్ రవి, మెప్మా ఆఫీసర్ నాగయ్య, ఆర్ పి శిరీష, స్పెషల్ ఆఫీసర్స్,వార్డ్ ఆఫీసర్స్, జవాన్లు, వార్డ్ ప్రజలు పాల్గొన్నరు.

Share it:

TELANGANA

Post A Comment: