మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 29 :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పోదాం వీరయ్య, జిల్లా కమిటీ మొత్తం ఇటీవల కొత్తగూడెం రైల్వే భూముల విషయంలో ఇల్లు కూల్చివేయ బడిన 108 కుటుంబాల నిర్వాసితులను వారి భూములు కోల్పోయిన స్థలాలు మరియు వారి స్వయంగా వారి పునరావాస కేంద్రాలకు వెళ్లి పరామర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూర్తిగా అండగా నిలుస్తామని వారి గళాన్ని అసెంబ్లీలో సైతం వినిపిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు అదేవిధంగా వీరికి ఎక్స్గ్రేషియా అత్యవసరంగా ప్రకటించాలని మరియు భూములు కోల్పోయిన భూమిని చూపిస్తూ ఇళ్లు నిర్మించి వారికి ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి మెమోరాండం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మోతుకూరి ధర్మారావు, నాగ సీతారాములు, ఎడవల్లి కృష్ణ,బాలశౌరి, తోట దేవి, ప్రసన్న , విజయలక్ష్మి, కౌన్సలర్ లక్ష్మణ్, ఎం పి టి సి సభ్యులు భద్రం, చింతలపూడి శేఖర్, లక్కినేని సురేందర్ దాల్సింగ్ నాయక్, గురజాల గోపి, కరీమ్ పాషా, సంతయ్య, నాగేంద్ర, పౌలు, యువజన కాంగ్రెస్ నుండి వీరబాబు, రామ్ లక్ష్మణ్,శ్రీను, సాయి,రాజేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు*
Post A Comment: