*కరోనా తగ్గిందని అజాగ్రత్త గా ఉండకండి.
*దాతల సహాయంతో నిత్యావసర సరుకులు అందజేత.
*తాడ్వాయి మండలం లోని ఒడ్డుగూడెం లో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని ఒడ్డు గూడెం గ్రామములో కరోనా తో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు దాతలు హైదరాబాద్ కు చెందిన రుద్ర ఫౌండేషన్ మరియు యునైటెడ్ వే ఆఫ్ స్వచ్చంధ సంస్థల సహకారంతో తో 43 కుటుంబాలకు నిత్యావసర సరుకులు బాల వికాస సంస్థ సహకారం తో మెడికల్ కిట్లు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా తీవ్రత తగ్గింది కావచ్చు కానీ కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు,అని ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్రెం లచ్చు పటేల్,మాజీ మండల అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్, రెడ్డి,మండల నాయకులు ముదర కోళ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: