మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాలతో ముమ్మరంగా పనులు
గుండాల జూలై 11 (మన్యం మనుగడ) కదిలిన మిషన్ భగీరథ యంత్రాంగం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, శనివారం మండలంలో పల్లె ప్రగతి ముగింపు ఈ కార్యక్రమానికి హాజరై సభలో మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలోనే మూడు రోజుల్లో అందరికీ మంచి నీళ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించడంతో మిషన్ భగీరథ యంత్రాంగం ఆదివారం పనులను ప్రారంభించారు మండలంలో మరియు మండల కేంద్రంలో నల్ల అమర్చండి ఇంటి వివరాలను సేకరించి అమర్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మంత్రి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పందించి మిషన్ భగీరథ నీళ్లను ఇంటికి వచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ పద్మావతి, ఏ ఈ బాలాజీ , గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు , నరసింహారావు , అనిల్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: