మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీ లో గురువారం జరిగిన 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఆకస్మికంగా సందర్శించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ లకావత్ భారతి నీ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి నివేదిక ను స్వయంగా పరిశీలిం చారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. సంతృప్తిని వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ సర్పంచ్ లకావత్ భారతి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బద్దులాల్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎం పి ఓ రామారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ కృష్ణవేణి, మాజీ సర్పంచ్ లకావత్ గిరిబాబు, ఎంపీటీసీ భానోత్ నీల, ఉప సర్పంచ్ లకావత్ బుజ్జి, కార్యదర్శి బోడా రాజేష్, గ్రామ పంచాయతీ పాలక సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: