👉గుండె జబ్బుతో 4సంవత్సరాలగా మంచానికి పరిమితం
👉గుండె ఆపరేషన్ కి 6 లక్షలు అవసరం
👉దాతల సహాయం కొరకు ఎదురు చూపులు
👉ఎల్చి రెడ్డి పల్లి గ్రామం ఎస్సీ కాలనీలో కొప్పుల సమ్మక్క ధీనగాథ
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్ సి రెడ్డి పల్లి గ్రామం ఎస్సీ కాలనీలో కొప్పుల సమ్మక్క 36 సంవత్సరాలు గుండె జబ్బు సమస్యతో గత నాలుగు సంవత్సరాల నుండి కొట్టుమిట్టాడుతోంది. భర్త కూలిపని చేసుకుంటూ ఇల్లు గదుపుతున్నారు. కానీ ఆ వ్యాధికి హైదరాబాదులో పల్స్ ఆస్పత్రిలో ఇప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ వారికి పేదరికం అడ్డొచ్చింది. ఇక చేసేది ఏమీ లేక మంచానికి పరిమితం అయిపోయింది. ఈ వ్యాధి తగ్గడం కోసం సుమారు 6 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది అని బాధిత కుటుంబసభ్యులు మన్యం టీవీ కి తెలిపారు. వీధి వాళ్లకు అడ్డం తిరిగింది రెక్కాడితే గాని నొక్కాడని పరిస్థితి ఏర్పడింది అంత పెద్ద మొత్తం డబ్బులు సమకూర్చుకోవడానికి దాతల కోసం ఎదురుచూస్తున్నారు ఇట్లు. సహాయం చేసే దాతలు భర్త కొప్పుల తిరుపతి రావు. 9581568942 7396869039 ని సంప్రదించి నిండు ప్రాణం నిలబెట్టండి.
Post A Comment: