మన్యం టీవీ మంగపేట.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆప్పయ్య గురువారం నాడు స్పెషల్ డ్రైవ్ సంబంధించి సర్వే పర్యవేక్షించడం లో భాగంగా, మంగపేట మండలంలోని బిక్షంపేట, నర్సయ్యగూడెం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే పర్యవేక్షించడం, సిబ్బంది రికార్డులను పరిశీలించి అనంతరం అక్కడ నిర్వహిస్తున్న రాట్ నిర్ధారణ పరీక్షల పనితీరును పరిశీలించి, గురువారం నాడు గ్రామంలో 148 రాట్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు, అక్కడికి వచ్చిన వారితో కోవిడ్ నియంత్రణ చర్యలు గురించి వివరించడం జరిగింది. ఆ గ్రామంలో పాజిటివ్ కేసులు ఇంటికి వారి వెంట ఎం పీ వో శ్రీకాంత్ ,డాక్టర్ నాగేష్ నాయక్, డాక్టర్ అనిష్ ,ఆర్ ఐ పి కామేశ్వరరావు,హెచ్ ఈ ఓ బాబురావు ,పి హెచ్ ఎన్ శకుంతల సి హెచ్ ఓ సత్యవతి వెళ్లి వారితో వారి ఆరోగ్య క్షేమ సమాచారం తెలుసుకొని ,కోవిడ్పాజిటివ్ వ్యక్తులు ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్లకూడదని గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో అసలు వెళ్ళకూడదని కుటుంబ సభ్యులతో పూర్తిగా ప్రత్యేక గదిలో నియంత్రణ చర్యలు పాటిస్తూ వైద్య అధికారులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలని వారికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ సిబ్బంది ఆరోగ్య సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం తోపాటు, ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీకి స్వయంగా పరీక్షలు నిర్వహించడం వారికి గర్భిణీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలందరికీ కోవిడ్ టీకాలు తీసుకునేవారికి నియంత్రణ చర్యలు తప్పకుండా పాటించాలని మాస్కులు తప్పకుండా ధరించాలి అని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైద్యాధికారులు సిబ్బంది పాజిటివ్ కేసుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకొని ఫోన్ ద్వారా గాని స్వయంగా గాని వెళ్లి వారి ఆరోగ్య క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని మరియు. సీజనల్ వ్యాధుల నుండి ప్రజలు కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Post A Comment: