టికా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి డి ఐ ఒ నాగేంద్రబాబు
గుండాల జూలై 8 (మన్యం టీవీ) ప్రాథమిక వైద్యశాలను డి ఐ ఓ నాగేంద్రబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం టీకాలు నమోదు చేసే రిజిస్టర్ ను ఆయన పరిశీలించారు. టికా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఐ ఎల్ ఆర్ డీ ఫ్రిడ్జ్ లో ని టీకాలను పరిశీలించి ఆయన అధికారులకు తగు సూచనలు చేశారు. టీకాలు వేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. టీకాల రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రవి చంద్, నాగభూషణం ,శ్రీహరి , సోమల నాయక్ ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: