మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు మొండికుంట గ్రామపంచాయతీలో ఇటీవల కొడుకు మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి నీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి చిత్ర పటానికి తుమ్మల నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు , జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్ ,టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, నాయకులు జాలె రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: