మన్యం మనుగడ, పినపాక: నాలుగో విడత పల్లె ప్రగతి లో భాగంగా ఐదవ రోజైన పవర్ డే కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ పాల్గొన్నారు. పినపాక మండలంలోని సింగిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ లో గల బీసు వారి గూడెం గ్రామంలో
ఏడూళ్ల బయ్యారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో, విద్యుత్ స్తంభాలను మార్చే ప్రక్రియ జరిగింది. అదేవిధంగా ఒక కొత్త స్తంభాలను సింగిరెడ్డి పల్లి గ్రామంలో వేయడం జరిగింది. అనంతరం దేవనగరం గ్రామానికి చెందిన విద్యుత్తు లైను, సి సి రోడ్డు ఏర్పాటు గురించి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, విద్యుత్ శాఖ వారికి సింగిరెడ్డి పల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో, దేవనగరం గ్రామస్తులు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ లక్ష్మీ రూపవతి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఎలక్ట్రికల్ ఏడీ జీవన్ కుమార్, ఏ ఈ రవీందర్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, లైన్మెన్ రజనీకాంత్, టిఆర్ఎస్ నాయకులు వడ్లకొండ శ్రీను, బొడ్డు హరిబాబు, చిన్నారి, పల్లె శ్రీనివాస్, కిషోర్, ప్రవీణ్, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీనివాస్ సింగిరెడ్డి పల్లి గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
Post A Comment: