జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
వ్యవసాయ రంగంలో మహాధన్ ఫర్టిలైజర్స్ సంస్థ సేవలు మరువలేనివని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో జరిగిన ఉచిత ఎరువులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సేవ చేస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి సంస్థ కి ధన్యవాదాలు తెలిపారు మహారాష్ట్రకు చెందిన మహాధన్ ఫెర్టిలైజర్ సంస్థ మారుమూల ప్రాంతమైన ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో రైతులకు సేవలు అందించటం అభినందనీయమన్నారు ఈ ప్రాంతంలో ఎంపిక చేసిన 1200 మంది రైతులకు రూ 4 లక్షల విలువైన ఎరువులను ఉచితంగా పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మహాధన్ ఆధ్వర్యంలో త్వరలోనే 500 మంది రైతులతో రైతు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర ఏ ఎరువులోను లేని స్మార్ట్ టెక్ విధానం కేవలం మహా ధన్ కు మాత్రమే ఉండటం వీరి ప్రత్యేకత అన్నారు గడిచిన రెండు సంవత్సరాలుగా గోదావరి పరివాహక ప్రాంతంలో మహాధన్ సేవలందిస్తోంద న్నారు. వ్యవసాయ రంగానికి రైతులకు సేవలందించేందుకు పలు సంస్థలు ఉదారంగా ముందుకు రావాలని సాంబశివ రెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు ఇప్పటికే పలు ఫర్టిలైజర్ మరియు విత్తన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లో మహాధన్ సంస్థ ప్రతినిధి వేణు వికాస్ అగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు వికాస్ రెడ్డి వివేకానందరెడ్డి ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజ మల్ల సుకుమార్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు షేక్ మదర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: