👉🏴నిరసనలు తెలియజేసిన ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది🏴
మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 14):: *అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఉపాధి హామీ పథకం సిబ్బంది, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు.
నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, సంగ్వీ గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయినాథ్. సాంకేతిక సహాయకులుగా( టెక్నికల్ అసిస్టెంట్) విధులు నిర్వర్తిస్తున్న రావుల రాజు పై క్రూరత్వంగా పెట్రోల్ పోసి నిప్పంటించినందుకు, అతనిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, పల్లెల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న తమలాంటి వారిపై దాడులకు పాల్పడడం చాలా విచారకరమని. తమ తోటి సిబ్బంది రావుల రాజు పై ఇంతటి దారుణానికి పాల్పడిన సాయినాధ్ ను,తక్షణమే శిక్షించాలని కోరుతూ, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓ-ప్రమీల, ఈసి-ఎంవికెపి రాజు, టిఏ-జె రాము, టిఏ-ఎస్ శ్రీనివాస్ రావు, టిఏ- కె పద్మ , టిఏ-బి నాగజ్యోతి, కంప్యూటర్ ఆపరేటర్-రమేష్ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: