పినపాక:
నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని, పినపాక మండలం లోని జానంపేట గ్రామంలో నాలుగవ రోజైన తడి పొడి చెత్త సేకరణ కార్యక్రమంలో మండలంలోని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుమ్మడి గాంధీ, తడి పొడి చెత్త సేకరణ గురించి గ్రామంలోని వారికి తెలియజేయడం జరిగింది. తడి చెత్త నుండి కంపోస్టు ఎరువును ఎలా తయారు చేసుకోవాలో వివరించడం జరిగింది. ప్రతి ఒక కుటుంబము విధిగా పంచాయతీ ట్రాక్టర్ తమ వీధిలోనికి వచ్చినప్పుడు, తడి చెత్త , పొడి చెత్త వేరు వేరుగా పంచాయతీ సిబ్బందికి అందివ్వాలని తెలియజేయడం జరిగింది. అనంతరం జానంపేట గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దగల ప్రదేశంలో హరితహారం లో భాగంగా మొక్కలను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, జానంపేట సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ,పినపాక మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్, సొసైటీ డైరెక్టర్ రాము, కామేశ్వరరావు, పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, జానంపేట ప్రత్యేకాధికారి రామారావు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: