గుండాల జూలై 27 (మన్యం మనుగడ ) మరో అశోకుడు మన కేసీఆర్ అన్నారు పినపాక ఎమ్మెల్యే విప్ రేగా కాంతారావు. సోమవారం గుండాల మండలం లో ఆయన పర్యటించి నూతనంగా వచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశామని త్వరలోనే మిగిలిన పనులన్నీ పూర్తయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఏడు వేల కోట్లు రూపాయలు రైతుబంధు లబ్ధిదారు ఖాతాలో జమ చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కండ్ల లా చూసుకుంటారని ఏ దానికి అన్యాయం చేయకుండా నిధులు కేటాయిస్తున్నా అన్నారు. గతంలో నేను చదువుకునేటప్పుడు సంక్షేమ హాస్టళ్లలో సాంబార్ పోస్తే పురుగుల తే లేవని ఇప్పుడు ప్రతి హాస్టళ్లలో సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 119 నియోజకవర్గాల్లో గురుకులాలను నెలకొల్పిన మహనీయుడు కెసిఆర్ అని అన్నారు. అలనాడు అశోకుడు మాదిరి చెట్లను హరితహారం కార్యక్రమం ద్వారా చెట్లను నాటడమే కాకుండా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని రూపకల్పన చేసి చెరువులకు పూర్వ వైభవం తెచ్చారని కొనియాడారు కెసిఆర్ నాయకత్వంలో గుండాల మండలాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యం, జెడ్ పి టి సి రామఅక్క, సర్పంచ్ సీతారాములు, తాసిల్దార్ రంగు రమేష్ , ఎంపీడీవో వలి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: