గుండాల జూలై 30 (మన్యం మనుగడ) పేద విద్యార్థులకు అండగా నిలిచిన చేతన ఫౌండేషన్ సభ్యులు సత్తు లాల్ పేద విద్యార్థులకు పాలిట దేవుడిలా నిలుస్తున్నాడు. మండలంలో చదువులో ఉత్తమంగా రాణిస్తూ పేదరికం వల్ల వారి చదువుకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయలేని విద్యార్థులను గుర్తించి పౌండేషన్ తరఫున ల్యాప్ టాప్ లను అందజేశారు . శుక్రవారం ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న విద్యార్థులతో పాటు మండలంలో ఉన్న గిరిజన విద్యార్థులకు సైతం అత్యంత ఖరీదైన ల్యాప్ టాప్ అందజేసి వారి ఉన్నత చదువు కోసం బాసటగా నిలిచారు ల్యాప్ టాప్ ఈ కార్యక్రమంలో అనిల్ , రషీద్, వెంకటేశ్వరరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: