CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీలో వలస గిరిజనేతరుల దాడులపై చర్యలు తీసుకోవాలి

Share it:

 


*మన్యంలోని ఆదివాసులంతా క్విట్ ఎజెన్సీ స్ఫూర్తితో గిరిజనేతరుల వలసలను అరికట్టాలి.

*ఏవిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు.

  మన్యం టీవీ ఏటూరు నాగారం                                

మండల కేంద్రంలోని ఐటిడిఎ ప్రాంగణంలో జిల్లా కార్యదర్శి పూనెం చంటి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఏటూరు నాగారం మండల పరిధిలోని చిన్న బోయినపల్లి కి చెందిన ఆదివాసి ఎట్టి వేణుగోపాల్ పై ఈ నెల 8 వ తారీఖున కొంతమంది గిరిజనేతరులు కుట్రపూరితంగానే దాడి చేసి గాయపరచినారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాన్ని ఖనిజ సంపదగా భావించి వలసలు వచ్చి అమాయక ఆదివాసీలను దోపిడీ చేస్తూ స్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి దాడి జరిపిన గిరిజనేతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులు కాలయాపన కట్టిపెట్టి వారిని రిమాండ్ కు తరలించాలని పత్రికా ముఖంగా ఆయన డిమాండ్ చేశారు. కోయ భుంకాల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మైపతి సంతోష్ కుమార్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కాక నరసింహారావు, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు సోందే మల్లుదొర, జిల్లా ఉపాధ్యక్షులు పర్సిక సతీష్, ఏఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి చేల శమంతకమని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: