శ్రమశక్తితో ముందుకు సాగాలి:ప్రసాద్
సమాత్ భట్టుపల్లి రైతు వేదిక ప్రాంగణంలో పినపాక,కరకగూడెం మండలాల ఫోటో&మీడియా నూతన కమిటి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫోటో&మీడియా గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మారుతీ ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ....
కరోనా కష్టకాలంలో ఫోటో&మీడియా ఎటువంటి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గుర్యౌమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫోటో&మీడియా గ్రాఫర్స్ అసోసియేషన్ కి భరోసా కల్పించాలని అన్నారు.
అసోసియేషన్ కి సబ్సిడీ ద్వారా ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
అదే విధంగా డబుల్ బెడ్రూమ్స్,రేషన్ కార్డు కల్పించాలని కోరారు.
ఫోటోగ్రఫీ గౌరవ షేరీఫ్ ఆధ్వర్యంలో పినపాక,కరకగూడెం మండలాల ఫోటో&మీడియా గ్రాఫర్స్ కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.
నూతన అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ...
ప్రతి ఒక్కరు శ్రమ శక్తితో భాద్యతగా ముందుకు సాగాలని ఆయన అన్నారు.
ఫోటోగ్రఫీ సభ్యులకు ఎటువంటి సమస్యలు రాకుండా ముందుండి నడిపిస్తానని తెలిపారు.
ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సహాయ,సహకారాలు అందిస్తామని తెలిపారు.
నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి రైతు వేదిక ప్రాంగణంలో మొక్క నటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కీసరి సుధాకర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు సారయ్య,మండల ప్రధాన కార్యదర్శి కమలాకర్,కోశాధికారి సాంబశివరావు,పూజారి క్రిష్ణ,రావుల రవి,క్రిష్ణామెహన్,రామక్రిష్ణ,పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: