CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామవరం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

Share it:

 


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 20 :- ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రామవరం ప్రాంతం ఈనాటికి కూడా అభివృద్ధికి నోచుకోని దుస్థితి లోనే ఉంది. మౌలిక వసతులు లేక, ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంత యువకులు ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సరి అయిన వైద్యం అందని దుస్థితి లో జీవనం గడుపుతున్నారు. దీనికి తోడు 36 వార్డుల చెత్త రామవరం లో వేయడం వల్ల చెత్త కుళ్ళి తగలబెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మూడు మతస్థుల శ్మశాన వాటికలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

స్మశాన వాటిక లకు వెళ్లే ఒకే ఒక్క దారి కావడంవల్ల ఎవరైనా చనిపోనా, స్మశానవాటికలకు సందర్శించడానికి వెళ్లాలన్నా మూడు మతస్తుల ప్రజలు ఎన్నో అవస్థలకు గురి కావడం జరుగుతున్నది.

రామవరం లో మౌలిక వసతుల కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, మూడు మతస్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తయారైన డంపింగ్ యార్డ్ ను తొలగించి

మూడు స్మశాన వాటిక లకు వెళ్లే దారిని సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మూడు స్మశాన వాటిక లలో చెట్టు నాటి నిరసన తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: