పాడి పంటలు సక్కంగ చూడాలె..
బోనాలు సమర్పించిన ఆలయ ధర్మకర్తలు..
మన్యం టీవీ : జూలూరుపాడు, జులై 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు శివారులో కొలువై ఉన్న కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తులు కుటుంబ సమేతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో టి ముత్యలమ్మ, కోటమైసమ్మ,పోతురాజు,లకు ఆషాడం మాసం బోనాలు సమర్పించారు. కోదండ రామాలయం, కోటమైసమ్మతల్లి, ఆలయ కమిటీ సభ్యులు, ఆషాఢమాసం సందర్భంగా బోనాలతొ అమ్మవార్లను కొలుచుకున్నారు. ప్రజలంతా పాడి పంటలతొ, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతొ, చల్లగా ఉండేలా చూడాలని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు,పెండ్యాల జగన్నాథం, చిట్లూరి మహేష్, సాయిన్ని క్రిష్ణార్జునరావు,తాళ్ళురి నవీన్,సిరపురపు నవీన్,సాయిన్ని రామారావు, నాగేశ్వరరావు, నర్వినేని పుల్లారావు, అనుమళ్ళ అశోక్,సిరపురపు ప్రసాద్, మరియు భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: