గుండాల / ఆళ్ల పల్లి జూలై 1 (మన్యం టీవీ) అల్లపల్లి మండలం పరిధిలోని అడవి రామారం గ్రామంలో గల వలస ఆదివాసీలకు గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ చేతుల మీదగా దోమ తెరలను పంపిణీ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయని వాటినుండి రక్షణ ఉండేందుకు దోమ తెరలను వాడాలని ఆయన సూచించారు. అనంతరం ప్రాథమిక వైద్యశాల వైద్యుడు రవి చంద్ మాట్లాడుతూ అడవి రామారం గ్రామంలోని వలస ఆదివాసీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందిని పరీక్షించగా పదిమందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. వారికి దోమతెర లతోపాటు మందులను పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ సత్యం , హెల్త్ అసిస్టెంట్ బిక్ష , తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: